Sannihitha

Friday, September 25, 2009

కిడ్నీ సమస్యలు:

మీకుతెలుసా?
              మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మూత్రపిండాలు.ఇవి
అత్యంత సున్నితమైనవే కాదు అత్యంత మొండివి కూడా.ఇది మనం తీసుకునే
ఆహరం లోని వ్యర్ధ పదార్ధాలను వడ కడతాయని మనకు తెలుసు కదా.కానీ ఆ
పనిని అవి చెయ్యలేక పోతే...జీవితం దుర్భరం...దుస్సహం...నిరంతరం ప్రత్యక్ష
నరకం.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న సమస్య కిడ్నీ సమస్య.దేనికి
తగిన కారణాలు ఏమిటో ఇప్పటికి తేలలేదు.ముఖ్యంగా ఈ వ్యాధి ఆంద్రప్రదేశ్ లోని
"శ్రీకాకుళం జిల్లా - ఉద్దానం" లో ఎక్కువగా నమోదైంది.అక్కడ ఇంటికి కనీసం ఒకరు
ఈ వ్యాధి తో భాధ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు.ఒక్క శ్రీకాకుళం లోనే కాదు
నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధులలో కిడ్నీ సమస్యదే అగ్రస్థానం.

జాగ్రత్తలు:
              పరిశుభ్రమైన నీటిని ఎక్కువగా తేసుకోవటం. బి.పీ ని  తరచుగా
పరిక్షించుకోవటం. బి.పీ ఎక్కువగా ఉన్నా,ఆకలి మందగించి, అకారణంగా
బరువు తగ్గినా,ఆగకుండా దగ్గు వచ్చినా వెంటనే రక్తపరీక్ష చేఇంచుకుంటే మంచిది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]



<< Home